ఓమ్వతీ… యూపీలోని ఓ మారుమూల పల్లెలో రైతు కూలీ. రోజువారీ లాగే తన పొలం పనుల కోసం రైలు పట్టాల వెంబడి నడుస్తూ వెళ్తోంది. ఎందుకో గానీ… ఆమె కన్ను రైలు పట్టాల వైపు వెళ్లింది. ఈ సమయంలోనే రైలు కూత వినిపిస్తోంది. దగ్గర్లోనే వుంది. ఆ రైలు పట్టాల మధ్య ఓ గ్యాప్ ఉందన్నది ఓమ్వతీ గుర్తించింది. అంతే… ఏమీ ఆలోచించలేదు. వెంటనే పక్కనున్న కర్రలను అప్పటికప్పుడు తీసుకొని వచ్చి, ఆ గ్యాప్ వున్న ప్రాంతంలో పాతేసింది. ఓ ఎరుపు రంగు చీరను ఆ కర్రలకు కట్టేసింది.
ఇదంతా కొన్ని క్షణాల్లోనే చేసేసింది. ఈ ఎరుపు రంగు చీరను రైల్ పైలట్ చూసి, అప్రమత్తమయ్యాడు. రైల్ను ఆపేశాడు. దీంతో కొన్ని వందల మంది ప్రాణాలను ఆ ఓమ్వతీ అనే రైతు కూలీ కాపాడింది. ఆ తర్వాత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, 30 నిమిషాల్లోగా ట్రాక్ను సరిచేశారు. దీంతో ఆ రైల్ క్షేమంగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని పోలీసు అధికారులు షేర్ చేశారు. దీనికి 58 వేల లైకులు వచ్చాయి.
श्रीमती ओमवती।
सुबह खेत पर काम करने जा रही थीं।
ट्रैक पार करते समय अचानक टूटी पटरी पर नजर पड़ गई।
ट्रेन आने वाली थी, इन्होंने समझदारी दिखाते हुए अपनी लाल रंग की साड़ी को लकड़ियों की मदद से ट्रैक पर खड़ा कर दिया।ट्रेन रोकी गई, पटरी ठीक हुई तब 30 मिनट बाद ट्रेन रवाना हुई।👏 pic.twitter.com/j4SJPTN3kl
— SACHIN KAUSHIK (@upcopsachin) March 31, 2022