పుణె: భారత సైన్యంలో పనిచేస్తున్న 43 ఏళ్ల మహిళా ఆఫీసర్ ఉరివేసుకుని అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపోలో జరిగింది. ఆ మహిళా ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆర్మీ, పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్లో ఉన్న ఆ ఆఫీసర్ తన రూమ్లో దుపట్టాతో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఆఫీసర్ శిక్షణ కోసం మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఆమెకు సమస్యలు ఉన్నట్లు తెలిసింది. విడాకులకు ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు డీసీపీ నమ్రతా పాటిల్ తెలిపారు. ఆఫీసర్ మృతి పట్ల విచారణ మొదలుపెట్టినట్లు చెప్పారు. ఆ ఆఫీసర్ సూసైడ్ చేసుకుని ఉంటుందని ఆర్మీ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఓ కోర్సులో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పింది. సివిల్ పోలీసుల వద్ద కేసు నమోదు చేశామని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించినట్లు ఆర్మీ వెల్లడించింది.