భోపాల్: నలుగురు వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gang Raped) అనంతరం పొలాల వద్ద ఆమెను పడేశారు. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పొలం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న 35 ఏళ్ల మహిళను కొందరు వ్యక్తులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కాగా, నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. ముగ్గురు వ్యక్తులు తనకు తెలిసిన వారేనని చెప్పింది. అనంతరం తనను పొలాల వద్ద పడేశారని ఆరోపించింది. అయితే నిందితుల్లో ఒకరు బాధితురాలి భర్త నిందితుడిగా ఉన్న హత్య కేసులో సాక్షి అని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.