లక్నో: ఒక మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 16వ అంతస్తు నుంచి కిందకు దూకింది. (Woman jumps with baby) తీవ్ర గాయాల వల్ల రక్తం మడుగులో మరణించింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి బిష్రాఖ్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లా రెసిడెన్షియల్ సొసైటీలోని ఎత్తైన టవర్ 2 పైనుంచి పసి పాపతో కలిసి మహిళ కిందకు దూకింది. పెద్ద శబ్దం రావడంతో సెక్యూరిటీ గార్డులు అక్కడకు వెళ్లి చూశారు. ఒక మహిళ, ఆమె ఆరు నెలల కుమార్తె రక్తం మడుగులో ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని 33 ఏళ్ల సారికగా గుర్తించారు. అనారోగ్యం వల్ల ఆమె డిప్రెషన్తో బాధపడుతోందని బంధువులు పోలీసులకు తెలిపారు. తల్లీ బిడ్డ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.