లక్నో, ఆగస్టు 13: యూపీలో ఒక గర్భిణీ రాజ్భవన్కు సమీపంలో రోడ్డు పక్కన ప్రసవించడం సంచలనం కలిగించింది. అయితే పుట్టిన బిడ్డ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఆదివారం లక్నోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ పాలిత యూపీ ప్రభుత్వంలో అధ్వాన్న వైద్య సేవలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్రంలో రోగికి కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో లేదని వారు విమర్శించారు.