Supriya Sule | మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఒకవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక, ఆ పార్టీ ఎవరిదనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (BJP), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MSN) పొత్తుపై ఊహాగానాలున్నాయి. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ నాయకురాలు, బారామతి ఎంపీ సుప్రియా సులే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్థాకరేను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాజ్ఠాక్రే శనివారం మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ పేరును ఎప్పుడూ ప్రస్తావించని శరద్ ప్రవార్ ప్రస్తుతం ఆయనను స్మరిస్తున్నారు. ఆయన తన ప్రసంగాల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ పేరును తీసుకుంటే ముస్లింల ఓట్లు పడవని భయపడి ఉండవచ్చన్న ఆయన.. ప్రస్తుతం పేరును ప్రస్తావిస్తున్నారన్నారు.
దీనిపై సుప్రియా సూలే స్పందిస్తూ శరద్ పవార్ పేరు తీసుకోకుండా అతను (రాజ్థాక్రే) ప్రజల దృష్టిని ఆకర్షించలేడు అంటూ ఎంఎన్ఎస్ చీఫ్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. పార్టీ, ఎన్నికల గుర్తు ఉండడం మన హక్కు అన్నారు. పార్టీని శరద్ పవార్ స్థాపించారు. దాన్ని ఆయన నుంచి లాక్కున్నారని.. పార్టీ, ఎన్నికల గుర్తు ఉండడం మన హక్కు కోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు.. ఎన్నికల కమిషన్కు సైతం కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.