న్యూఢిల్లీ, మే 29: పన్నెండో తరగతి విద్యార్థులు 11వ తరగతిలో, ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన సగటు మార్కులను పంపాలని తన అనుబంధ పాఠశాలలను సీఐసీఎస్ఈ బోర్డు ఆదేశించింది. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను కరోనా కారణంగా బోర్డు వాయిదా వేసింది. ఇప్పుడు మార్కుల సమాచారం అడగడాన్ని బట్టి పరీక్షలను రద్దు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను సీఐసీఎస్ఈ రద్దు చేసింది.