న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం నిర్మాణంతో మనం కొత్త ఆధ్యాత్మిక యుగంలోకి ప్రవేశించామని బీఆర్ఎస్ ఎంపీ బీమ్రావ్ బసంత్రావు పాటిల్(MP BB Patil) అన్నారు. దేశం ఆధ్యాత్మిక పథంలో నడుస్తోందన్నారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశమంతా సంబరం జరుపుకుందన్నారు. హిందువులు ఆ ఆలయాన్ని మహత్వపూర్ణంగా భావిస్తామన్నారు. అయోధ్య రామమందిరం ప్రముఖ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగనున్నట్లు ఆయన చెప్పారు. భారత ఇతిహాసంలో 22 జనవరివ తేదీ మరో అధ్యాయాన్ని జోడించిందన్నారు.
అయోధ్యను రాముడి జన్మస్థానంగా భావిస్తామని ఎంపీ పాటిల్ పేర్కొన్నారు.. నగర శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారన్నారు. ఇక అయోధ్య పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుందని, స్థానికులకు ప్రతి రోజు ఆదాయం దొరుకుతుందన్నారు. ప్రాచీన, ఆధునిక కళల మేళవింపులో రామ మందిరం నిర్మించారన్నారు. ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుందన్నారు.
జహీరాబాద్లో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయని, ప్రాచీన మందిరాలు ఉన్నాయని, వాటి అభివృద్ధి కోసం తమ నియోజకవర్గానికి ఆర్థిక సహకారం అందించాలని ఎంపీ బీబీ పాటిల్ కేంద్రాన్ని కోరారు. ఆలయాలను అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుందన్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని, స్థానికులకు రోజువారీ ఆదాయం వస్తుందన్నారు.