న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి 1.3 కోట్లకుపైగా టీకా డోసులు వేయగా, సాయంత్రం ఐదు గంటలకు ఇది రెండు కోట్లకుపైగా నమోదైంది. దీంతో ‘ఈ చారిత్రక రికార్డు.. ప్రధాని మోదీ పుట్టిన రోజు బహుమతి’ అంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ట్వీట్ చేశారు.
మరోవైపు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ‘కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశ టీకాల నిర్విరామ ప్రయత్నాలను జరుపుకుంటూ, రియల్ టైమ్లో టీకాలు వేస్తున్నామని చూపించడానికి మేము ఒక టిక్కర్ను జోడించాము. ప్రస్తుతం నిమిషానికి 42,000 టీకాలు లేదా సెకనుకు 700కు పైగా టీకాలు ఇది చూపిస్తున్నది’ అని పేర్కొన్నారు.
కాగా, ఆగస్ట్ 31న దేశంలో గరిష్ఠంగా ఒకే రోజు 1.3 కోట్ల డోసుల టీకాలు వేశారు. తాజాగా శుక్రవారం రెండు కోట్లకుపైగా టీకా డోసులతో కొత్త రికార్డు నెలకొన్నది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఈ ఏడాది జనవరి నుంచి శుక్రవారం ఉదయానికి 77 కోట్ల డోసుల టీకాలు వేయగా సాయంత్రానికి ఇది 79 కోట్ల డోసులను దాటింది.
#VaccineSeva को चरितार्थ करते हुए स्वास्थ्य कर्मियों एवं देशवासियों की तरफ़ से प्रधानमंत्री जी को उपहार।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021
प्रधानमंत्री @NarendraModi जी के जन्मदिन पर आज भारत ने नया कीर्तिमान स्थापित करते हुए एक दिन में 2 करोड़ टीके लगाने का ऐतिहासिक आँकड़ा पार किया है।
Well done India! pic.twitter.com/P94vXMN4Ow
2,00,00,000 mark crossed!
— Jagat Prakash Nadda (@JPNadda) September 17, 2021
This figure is a reflection of New India under PM @narendramodi’s leadership. India has set a path in successfully fighting COVID with visionary & diligent leadership. Congratulations to those who got vaccinated & those who made this campaign a success. pic.twitter.com/dlaRlytRV8