న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా బియ్యం ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. మొన్నటి వరకు రిటైల్ గోధుమ ధరలు మండిపోగా, తాజాగా బియ్యం ధరలు కూడా అదే దారిలో వెళ్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే దాదాపు 6.31 శాతం మేర ధరలు పెరిగాయని కేంద్ర వినియోగదారుల శాఖ డాటా ప్రకారం తెలుస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరాసరి బియ్యం ధర రూ. 37.7గా ఉన్నది. కాగా, దేశవ్యాప్తంగా గోధుమ ధరలు కూడా భారీగా పెరిగాయి. గతేడాది ఇదే సమయానికి కేజీ గోధుమల ధర రూ.25.41 ఉండగా, ఈ ఏడాది 22 శాతం మేర పెరిగి, కేజీ గోధుమ 31.04గా ఉన్నది. అదే గోధుమ పిండి చూసుకుంటే 17 శాతం మేర పెరిగి, రూ.30.04 నుంచి 35.17 కు ధరలు ఎగబాకాయి.