తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మరణించిన సిబ్బందిలో వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ ఒకరు. ఆయన పార్థివ దేహాన్ని ఆర్మీ సిబ్బంది కుటుంబీకులకు అందజేశారు. పృథ్వీ సింగ్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడికి 9 ఏళ్లు. కుమార్తెకు 12 ఏళ్లు. అయితే తండ్రికి వారి కుటుంబం మొత్తం శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
తండ్రి చివరి చూపు కోసం, శ్రద్ధాంజలి ఘటించడం కోసం 9 ఏళ్ల కుమారుడు అవిరాజ్ పార్థివ దేహం దగ్గరికి వచ్చాడు. ఈ సమయంలో తండ్రి (వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్) తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకొని, తన తలపై పెట్టుకొని, తండ్రికి సెల్యూట్ చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఆయన కూతురు ఆరాధ్య కూడా ఉంది. ఆరాధ్య కూడా అదే పని చేసింది. ఈ సమయంలో వారిద్దరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ టోపీని ధరించి తండ్రికి ఆఖరి సారిగా సెల్యూట్ చేసి, వీడ్కోలు పలికారు.