పనాజీ : గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ అన్నారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలు తమకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, దాదాపు 20 సీట్లు వస్తాయన్నారు. మోదీపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.
బీజేపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలకు ఒక అడుగు దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 11 సీట్లు, ఆప్ రెండు, ఎంజీపీ 2, గోవా ఫార్వర్డ్ పార్టీ 2, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరో వైపు మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఇవాళ గవర్నర్ను కలువనున్నారు.