Siddaramaiah | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): వచ్చే ఐదేండ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తానే సీఎంగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. కర్ణాటక కాంగ్రెస్లో ‘సీఎం కుర్చీలాట’ మొదలైందన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రెండున్నరేండ్ల తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారన్న వార్తలను కొట్టిపారేశారు.
మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించనున్నారన్న వార్తలపై స్పందించిన సిద్ధరామయ్య.. ఈ విషయం ఎవరు చెప్పారంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సీఎం మార్పు గురించి ఇకపై మాట్లాడబోనని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడుతానని వెల్లడించారు.