సీడీఎస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిపిన్ రావత్ హఠాన్మరణం దేశాన్ని కలిచివేసింది. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, ఇతర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే తదుపరి సీడీఎస్ గా ఎవరిని నియమిస్తారు? అసలు ఈ సీడీఎస్ పదవి విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తదుపరి సీడీఎస్ను కేంద్రం నియమిస్తుందా? లేదంటే రాష్ట్రపతి విశేషాధికారాల్లో దీనిని కలిపేస్తుందా? ఏం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
లేదంటే త్రివిధ దళాలకు చెందిన ఏదో ఒక దళంలో విశేష సేవలందించి, అనుభవం గడించిన మాజీ అధికారికి ఈ బాధ్యతలు అప్పజెబుతారా? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అయితే సైన్యంలోని కొందరు సీనియర్ల ప్రకారం… ఈ పదవి దేశ రక్షణతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఈ పదవిని కొత్త వ్యక్తికే అప్పజెబుతారని పేర్కొంటున్నారు. ఆర్మీలోని సీనియర్ అధికారులు సీడీఎస్గా ఎవర్ని నియమించాలన్నది ఆలోచిస్తారని తెలిపారు.
భారత తొలి సీడీఎస్ బిపిన్ రావతే. అంతకుముందు వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.