న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ(Minister Balaji)ని ఇటీవల మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి బాలాజీ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రిని ఈడీ అదుపులోకి తీసుకున్నది. రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మంత్రి బాలాజీ భార్య మేఘలా ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటీషన్ పై జస్టిస్ సీవీ కార్తికేయన్ విచారించనున్నారు.