ముంబై: క్యాంటీన్ కాంట్రాక్టర్ను కొట్టిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్యాన్స్, లేడీస్ బార్లు నడిపే దక్షిణాది వారికి మహారాష్ట్రలో ఆహార సరఫరా కాంట్రాక్టులను ఇవ్వకూడదన్నారు. “షెట్టీ అనే పేరున్న వ్యక్తికి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు? మరాఠీ వ్యక్తికి ఇవ్వండి. మనం ఏం తింటామో వారికి తెలుస్తుంది.
వారు మనకు మంచి నాణ్యమైన ఆహారం అందిస్తారు. దక్షిణాది వారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లు నడుపుతారు, మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తారు. వాళ్లు మన పిల్లలను కలుషితం చేస్తున్నారు. వాళ్లు మంచి ఆహారాన్ని ఎలా అందిస్తారు?” అని మండిపడ్డారు. షిండే వర్గానికి చెందిన గైక్వాడ్ రెండుసార్లు బుల్ధానా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.