న్యూఢిల్లీ: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారారు. ఇస్లాం మత వ్యవస్థాపకుడు ప్రవక్తపై ఆమె ఓ టీవీ చర్చలో అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాన్ని రేపారు. ఆరబ్ దేశాలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఉన్న నూపుర్పై ఆ పార్టీ వేటు వేసింది. నూపుర్ శర్మ ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఢిల్లీ వర్సిటీ నుంచే ఆమె ఎల్ఎల్బీ చదివారు. ఇక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె లా సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్పై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ యువమోర్చాలో అనేక కీలక హోదాల్లో పనిచేశారు. 2017లో ఢిల్లీ బీజేపీ అధికారి ప్రతినిధిగా ఆమెను నియమించారు. 2020 సెప్టెంబర్లో జేపీ నడ్డా బృందంలోకి ఆమె వెళ్లారు. జాతీయ అధికార ప్రతినిధిగా ఆమెను నియమించారు. టీచ్ ఫర్ ఇండియా యూత్ అంబాసిడర్గా ఆమె కొనసాగుతున్నారు.