న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడం వల్ల ఇండియాలో వైద్య సేవలకు అకస్మాత్తుగా డిమాండ్ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. చాలా వేగంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోందని, అనేక మంది అస్వస్థతకు లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆమె అన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఒమిక్రాన్ వల్ల హాస్పిటళ్లపై భారం పడడమే కాకుండా.. తర్వాత దశలో అది ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్పై ప్రభావం చూపుతుందని, ఐసీయూల నుంచి ఇంటి వద్ద కేర్ తీసుకునే వ్యవస్థలపై కూడా పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ప్రజలు ఆందోళన చెందుతున్నారని, లక్షణాలు లేకున్నా.. డాక్టర్లను కలవాలన్న ఆందోళన ఉంటుందని, దాని కోసం ప్రిపేరై ఉండాలని సౌమ్యా తెలిపారు. టెలీహెల్త్, టెలీమెడిసిన్ సేవలను విస్తృతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఒమిక్రాన్ విజృంభణ వల్ల ఎక్కువ శాతం ఔట్ పేషెంట్స్, ఇంటి వద్ద చికిత్సలపై ప్రభావం పడనున్నట్లు ఆమె తెలిపారు.