న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్ముకశ్మీర్ పోలీసులు ఇటీవల ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించగా కొత్త విషయం బయటపడింది. కొంతమంది డాక్టర్లు, రాడికల్ మత ప్రచారకులు కలిసి ‘అన్సార్ ఇంటీరియం’ పేరుతో కొత్త ఉగ్రసంస్థను ఏర్పాటుచేసుకున్నట్టు తేలింది.
జమ్ముకశ్మీర్లో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడేందుకు దీనిని 2022లో ఏర్పాటుచేసినట్టు పోలీసు అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. ఢిల్లీ ఎర్ర కోట దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ, 2016-18 మధ్య కాలంలో పలు ఉగ్రవాద గ్రూపుల్లో చేరడానికి ప్రయత్నించాడని, అయితే.. డాక్టర్లు, మరికొంత మందితో కలిసి కొత్త సంస్థను శ్రీనగర్లో ఏర్పాటుచేసినట్టు పోలీసులు చెప్పారు.