ముంబై, డిసెంబర్ 15: ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే. ఆ ఊరిలో ఉత్తమ్ పవార్కు ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు రెండు రాష్ర్టాల సరిహద్దు మధ్యలో ఉన్నది. దీంతో సగం ఇల్లు తెలంగాణకు, సగం ఇల్లు మహారాష్ట్రకు చేరింది. ఆ ఇంట్లో ఉత్తమ్తో పాటు అతడి సోదరుడి కుటుంబం కూడా ఉంటుంది. మొత్తం 13 మంది నివాసం ఉంటారు. ఈ ఇల్లును సోదరులిద్దరు పంచుకోగా, తెలంగాణలోని నాలుగు గదులు సోదరుడికి, మహారాష్ట్రలోని నాలుగు గదులు ఉత్తమ్కు వచ్చాయి. అయితే, ఉత్తమ్కు వచ్చిన కిచెన్ మాత్రం తెలంగాణలో ఉండటం విశేషం. వీళ్లింట్లో బైక్లు, కార్లు కూడా రెండు రాష్ర్టాల రిజిస్ట్రేషన్ను కలిగి ఉంటాయి. అధికారులు ఈ ఇంటి గోడపై రెండు రాష్ర్టాల సరిహద్దు గీత గీసి, రాష్ర్టాల పేర్లు రాశారు.