India on Ukraine-Russia | ఆసియా దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు నిబంధనలు వల్లెవేసే యూరప్ దేశాలు చేసిందేమిటని భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశ్నించారు. పాశ్చాత్యదేశాలు వాణిజ్యానికే ప్రాధాన్యం ఇస్తాయన్నారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై భారత్ ఎటువంటి సలహా ఇవ్వలేదు. దౌత్యమార్గంలోకి వెళ్లి యుద్దానికి స్వస్తి పలుకడమే తప్పనిసరి అని చెప్పారు. మంగళవారం జియో పాలిటిక్స్ అండ్ జియో ఎనకమిక్స్పై రైసినా డైలాగ్ ఏడో సదస్సు మొదలైంది. ఈ సదస్సులో 90 దేశాలకు చెందిన 210 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ సదస్సును ప్రారంభిస్తూ.. ఉక్రెయిన్లో సంక్షోభమే ప్రధాన చర్చనీయాంశంగా మారిందని నేను గుర్తిస్తున్నా. ఉక్రెయిన్పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభానికి ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. అధిక ఇంధన ధరలు, ఆహార ద్రవ్యోల్బణం, వివిధ అంశాల్లో గందరగోళంతో పరిస్థితులు విషమిస్తున్నాయన్నారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని తప్పనిసరిగా నిలువరించాలంటే దౌత్య మార్గంలోకి వెళ్లి సంప్రదింపులు జరుపడమే పరిష్కార మార్గం అని జై శంకర్ అన్నారు. మనం వాస్తవంగా దృష్టి సారించాల్సిన అంశం కూడా అదేనన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నది. దీన్ని ఈయూ, అమెరికా-దాని మిత్ర దేశాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.