కోల్కతా: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ఆ పార్టీ నేత అయిన అధీర్ రంజన్ చౌదరీ ట్విట్టర్ ఖాతాలో శనివారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఒక పోస్ట్ వచ్చింది. ‘ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు, భూమి కంపిస్తుంది’ అని అందులో ఉంది. 1984లో ఇందిరా గాంధీ మరణాంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ నాడు ఈ ప్రకటన చేశారు. అయితే దేశ వ్యాప్తంగా సుమారు 3000 మంది మరణానికి కారణమైన సిక్కు వ్యతిరేక అల్లర్లను సమర్థించేలా రాజీవ్ గాంధీ వ్యాఖ్య ఉందంటూ విపక్ష నేతలు పలు సందర్భాల్లో విమర్శించారు.
కాగా, ‘ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు, భూమి కంపిస్తుంది’ అంటూ రాజీవ్ గాంధీ గతంలో చేసిన ఈ స్టేట్మెంట్ శనివారం ఆయన వర్ధంతి నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరీ ట్విట్టర్ పోస్ట్లో కనిపించింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ ట్వీట్ను ఆయన వెంటనే తొలగించారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని అధీర్ రంజన్ చౌదరీ తెలిపారు. అలాంటి ప్రకటనలు నేను ఎందుకు చేస్తాను అని ప్రశ్నించారు. తన పేరుతో వచ్చిన ట్వీట్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీని గురించి కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటో, స్టేట్మెంట్తో కూడిన మరో ట్వీట్ చేశారు.
— Adhir Chowdhury (@adhirrcinc) May 21, 2022