న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సిల్కియారా టన్నెల్(Uttarakhand Tunnel)లో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు రెండు వారాల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ఆ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఓ పైప్లైన్ను ప్రస్తుతం డ్రిల్ చేస్తున్నారు. ఒకసారి ఆ పైప్లైన్ ఆ వర్కర్ల వద్దకు చేరుకోగానే వారిని బయటకు తీసుకురానున్నారు. పైప్లైన్లో వీల్ స్ట్రెచర్ల ద్వారా ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించనున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఆ స్ట్రెచర్ల పనితీరును పరీక్షించారు. స్ట్రెచర్పై పడుకున్న తర్వాత ఒక్కొక్క కార్మికుడిని బయటకు లాగనున్నారు. టన్నెల్ బయట ఉన్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఆ స్ట్రెచర్ను పుల్ చేయనున్నారు.
#WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk
— ANI (@ANI) November 24, 2023