చండీఘడ్: ఖలీస్తానీ(Khalistani) గ్రూపు వార్సీ పంజాబ్ దే(Waris Punjab De) నేత అమృత్పాల్ సింగ్(Amritpal Singh)ను అరెస్టు చేసేందుకు పంజాబీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి ఎలా అమృత్పాల్ తప్పించుకున్నట్లు ఇవాళ పంజాబ్ హైకోర్టు ప్రశ్నించింది. ఆ ఆపరేషన్పై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. 80 వేల మంది పోలీసులున్నారు.. మీరేం చేస్తున్నారు, అమృత్పాల్ సింగ్ ఎలా ఎస్కేప్ అయ్యారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ విఫలమైనట్లు(Intelligence failure) కోర్టు పేర్కొన్నది.
అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేయాలని శనివారం ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పంజాబ్ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఖలిస్తానీ నేత అమృత్పాల్కు చెందిన 120 మంది మద్దతుదారుల్ని(supporters) అరెస్టు చేసినట్లు చెప్పారు. అమృత్పాల్ గత కొన్నేళ్ల నుంచి పంజాబ్లో యాక్టివ్గా ఉన్నాడు. సాయుధ మద్దతుదారులతో ఆయన ఎప్పుడూ తిరుగుతుంటాడు. వేర్పాటువాద(separatist) నేత జర్నెల్ సింగ్ బింద్రేవాలా బాటలో నడుస్తున్నట్లు ఆయన పలుమార్లు చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను భగ్నం చేయాలనుకునేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇవాళ సీఎం భగవంత్మాన్ సింగ్(CM Bhagwanth Mann) తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తినీ సహించబోమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు శాంతిని, ప్రగతిని ఆశిస్తున్నట్లు మాన్ చెప్పారు.