గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయాన్ని ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. కామాఖ్యా దేవికి పూజలు నిర్వహించి.. అక్కడి పూజారులు ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు కోల్కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ స్వీప్ చేసింది. ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విక్టరీ నమోదు చేసిన తృణమూల్.. కోల్కతా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ను వరుసగా మూడవ సారి ఆ పార్టీ సొంతం చేసుకున్నది. తాజా సమాచారం ప్రకారం 144 వార్డుల్లో.. టీఎంసీ 101 వార్డులను గెలుచుకున్నది. మరో 33 వార్డుల్లో ఆ పార్టీ లీడింగ్లో ఉంది.