బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన హత్యా కాండపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా సర్కార్పై ధన్కర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్లో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది. భయంకరమైన హింస, సజీవ దహనాలు చూస్తుంటే ఇదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు 8 మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ నుంచి నేను ఓ రిపోర్ట్ అడిగా. బాధిత కుటుంబాలకు నా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా.’ అంటూ గవర్నర్ ధన్కర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లో టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్ధరాత్రి హింస చెలరేగింది. అల్లరి మూకలు 10-12 ఇండ్ల తలుపులు మూసివేసి నిప్పంటించారు. ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్హాట్లో జరిగిన టీఎంసీ ఉపాధ్యక్షుడి హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం సమాచారం అందుకున్న డీఎంతో పాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.