న్యూఢిల్లీ: జీ20 సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. అయితే వివిధ దేశాధినేతలు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. అన్ని దేశాధినేతల్ని ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. అయితే లీడర్లను ఆహ్వానించే ప్రదేశంలో ఉన్న బ్యాక్గ్రౌండ్పై భారీ కోణార్క్ వీల్(Konark Wheel)ను ముద్రించారు. కోణార్క్ వీల్ వద్దే వివిధ దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. వెల్కమ్ హ్యాండ్షేక్ ఇవ్వనున్నారు. ఒడిశాకు చెందిన కోణార్క్ వీల్ .. అతిథుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 13వ శతాబ్ధంలో ఒకటో నర్సింహదేవ రాజు కోణార్క్ వీల్ను నిర్మించారు. ఈ చక్రం ఆధారంగానే జాతీయ జెండాలో 24 చువ్వలు ఉన్న వీల్ను పొందుపరిచారు. భారతీయ ప్రాచీన సంస్కృతి, నాగరికత, వాస్తు కళకు ఆ చక్రం ప్రతిబింబంగా నిలువనున్నది. కోణార్క్ వీల్లో ఉన్న రొటేషన్ మోషన్.. కాలచక్రానికి సంకేతంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం ఆదర్శాలు, నిబద్ధతకు ఈ చిహ్నం శక్తివంతంగా నిలుస్తుందని చెబుతున్నారు. సమావేశాలకు హాజరవుతున్న ప్రతినిధుల కోసం ప్రత్యేక కోణార్క్ వీల్ బ్యాడ్జీలను అందిస్తున్నారు.
#WATCH | G 20 in India: President of South Korea Yoon Suk Yeol arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/7q5wGgxqR6
— ANI (@ANI) September 9, 2023