న్యూఢిల్లీ: ఒకరికి పెండ్లి చేయడానికి సంబంధాన్ని చూడటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో, రాజస్థాన్కు చెందిన సూర్జారామ్ గోదారా ఏకంగా 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు. వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖను ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించారు. ఐదుగురు మనుమలకు ఏప్రిల్ 1న, 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు. బికనీర్ జిల్లా, నోఖా మండలం, లాల్మదేసర్ గ్రామంలో, ఒకే ఇంట్లో ఇలా సామూహిక వివాహాలు జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.