Rajnath Singh | ఏ మతమైనా మహిళలపై అణచివేతను అనుమతించబోమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రిపుల్ తలాక్ చట్టంపై ఆయన స్పందించారు. సీఏఏ చట్టంతో ఎవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. డీఎంకే, కాంగ్రెస్లను లక్ష్యంగా చేసుకుని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రెండు తమ కుటుంబాల కోసం పనిచేస్తున్నాయని, ప్రధాని మోదీ దేశం కోసం పనిచేస్తున్నారన్నారు.
కిర్రబులో ఆయన రోడ్లో నిర్వహించారు. నామక్కల్ అభ్యర్థి కేపీ రామలింగం తరఫున ప్రచారం నిర్వహించారు. అలాగే తిరువూరు అభ్యర్థి ఎస్జీఎం రమేశ్ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. సాయంత్రం రాజ్నాథ్ సింగ్ తెన్కాశీలో బీజేపీ అభ్యర్థి బీ జాన్ పాండియన్కు మద్దతుగా రోడ్షో నిర్వహించనున్నారు. రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల సైతం తమిళనాడులో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.