జోధ్పూర్: భారత, ఫ్రెంచ్ వైమానిక దళాలు ఇవాళ జోధ్పూర్లో గరుడ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ మాట్లాడుతూ.. మన వైమానిక దళాన్ని ఆధునీకరించాలని, దీని కోసం మన దళంలోకి 4.5 జనరేషన్కు చెందిన యుద్ధ విమానాలు అవసరం ఉందన్నారు. అయిదు లేదా ఆరు స్క్వాడ్రన్ల(రఫేల్) 4.5 జనరేషన్కు చెందిన విమానాలు మనకు అత్యవసరం అన్నారు.
భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో వైమానిక దళం కీలకంగా మారనున్నట్లు చౌదరీ వెల్లడించారు. యుద్ధం ఫలితాన్ని తేల్చడంలో వైమానిక సత్తా ప్రధానం కానున్నదని అన్నారు. గరుడ లాంటి వైమానిక విన్యాసాలతో మన నైపుణ్యాన్ని మరింత పదునుపెట్టవచ్చు అని వీఆర్ చౌదరీ తెలిపారు. స్నేహపూర్వక దేశాలతో విమానాల ఆపరేషన్స్ గురించి లోతుగా నేర్చుకోవాలన్నారు.
భారతీయ వైమానిక దళంతో కలిసి తమ దేశం వైమానిక దళం విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు ఫ్రాన్స్ వైమానిక దళ అధిపతి జనరల్ స్టీఫెన్ మిల్లీ తెలిపారు. ఇలాంటి ఈవెంట్ల వల్ల .. యుద్ధ విన్యాసాలను పరస్పరం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నారు.
అంతకుముందు రష్యాకు చెందిన సుఖోయ్-30 ఫైటర్ జెట్లో జనరల్ స్టీఫెన్ మిల్లీ జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యారు. ఇక ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ.. రఫేల్ యుద్ధ విమానంలో జోధ్పూర్లో ల్యాండ్ అయ్యారు.