జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను బలి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.