గువాహటి: లౌకికవాదం, సామాజిక వాదం, ప్రజాస్వామ్యం గురించి మనం ప్రపంచ దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అవన్నీ మన సాంప్రదాయాల్లో, మన రక్తంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లౌకికవాదం, సామాజికవాదం, ప్రజాస్వామ్యం లాంటి మన దేశం ఎప్పటి నుంచే పాటిస్తూ, ఇప్పటికే ఆచరణలోనే ఉంచిందని మోహన్ భగవత్ తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అనేవి దేశంలోని ఏ ఒక్క పౌరుడికి వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంవల్ల దేశంలోని ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. భారతీయ ముస్లింలను కాపాడుకుంటామని దేశ విభజన సమయంలో భారత్ హామీ ఇచ్చిందని, భారత్ ఆ హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నదని, కానీ పాకిస్థాన్లో హిందువులకు రక్షణ కల్పిస్తామన్న హామీని ఆ దేశం నిలబెట్టుకోలేదని మోహన్ భగవత్ విమర్శించారు.