అయోధ్య: శ్రీ రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణం శాస్త్ర ప్రకారం జరుగుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) తెలిపారు. 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావద్దు అన్న నెపంతోనే కాంగ్రెస్ పార్టీ సాకులు చెబుతోందన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు కూడా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టపై ఇటీవల స్పందించారు. అయితే ఈ అంశంపై శంకరాచార్యుల అభిప్రాయాలను, ఆలోచనలను ప్రశ్నించలేమని, ఆ అంశంపై తానేమీ మాట్లాడలేనని సత్యేంద్ర దాస్ తెలిపారు.
#WATCH | On Shankaracharyas not attending Ayodhya Ram Temple ‘Pran Pratishtha’, Acharya Satyendra Das, chief priest of Shri Ram Janambhoomi Teerth Kshetra “…We can’t question the views and thoughts of the Shankaracharyas…I can’t say anything on it.” pic.twitter.com/hxVaNDNZoI
— ANI (@ANI) January 13, 2024
రామాలయ నిర్మాణాన్ని బీజేపీ రాజకీయం వాడుకుంటున్నట్లు అంశంపై కూడా సత్యేంద్ర దాస్ రియాక్ట్ అయ్యారు. రాజనీతి, ధర్మనీతి ఉంటుందని, శ్రీరాముడిని బీజేపీ సొంతం చేసుకున్నదని, అందుకే ఆ పార్టీకి ఆయన ఆశీస్సులు దక్కాయని, ఇది రాజనీతి కాదు అని, కానీ దీన్నే ధర్మనీతి అంటారని సత్యేంద్ర దాస్ తెలిపారు. ఇప్పుడు రామ రాజ్యం వస్తోందని ఆయన అన్నారు. రామ్ లల్లాను పర్మనెంట్ గుడికి మార్చాలన్న ప్రయత్నాలను మరే పార్టీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
బెంగాల్లో సాధువులపై జరిగిన అటాక్ గురించి కూడా సత్యేంద్ర దాస్ కామెంట్ చేశారు. మమతా బెనర్జీకి ముంతాజ్ ఖాన్ అన్న పేరు ఉందని విమర్శించారు. బెంగాల్లో రామనవమి, ఇతర ర్యాలీల సమయంలోనూ దాడులు జరిగినట్లు చెప్పారు. కాషాయ రంగు చూస్తే ఆమె ఆగ్రహానికి గురవుతుందని, అందుకే ఈ దాడులు జరుగుతాయని ఆమె అన్నారు. ఇలాంటి దాడుల్ని ఖండిస్తున్నట్లు సత్యేంద్ర దాస్ తెలిపారు.