న్యూఢిల్లీ: ప్రతి మనిషి వేలి ముద్రలు, ఐరిస్ వేరువేరుగా ఉంటాయి. దీని ఆధారంగా ఇప్పటికే చాలా టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అలా రూపొందించిన టెక్నాలజీతోనే ఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా స్మార్ట్ఫోన్ అన్లాక్ చేస్తున్నాం. ఈ రెండే గాక.. సరికొత్తగా మనిషి తీసుకునే ఊపిరి లేదా శ్వాసతోనూ ఫోన్ అన్లాక్ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ మద్రాస్ సైంటిస్టులు. ఈ బ్రీతింగ్ టెక్నాలజీని ప్రాక్టికల్ అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక, సెల్ఫోన్ అన్లాక్ సహా భద్రతాపరమైన కార్యకలాపాల కోసం వాడొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ వైద్యపరంగా ఎంతగానో ఉపయోగపడుతుందని, బయోమెట్రిక్ అప్లికేషన్ రూపొందాక, ఫోన్ అన్లాక్, తలుపులు తెరవటం వంటివి కూడా చేయొచ్చుని పరిశోధక బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ మహేశ్ చెప్పారు. మానవుల శ్వాస (బ్రీతింగ్) ఆధారంగా పరిశోధకులు అల్గారిథంను రూపొందిస్తున్నారు. 94 మంది నుంచి వివిధ రకాలుగా శ్వాసకు సంబంధించి శాంపిల్స్ తీసుకొని, అల్గారిథంను రూపొందించారు. వీటితో మనిషిని గుర్తించేందుకు జరిపిన పరీక్షల్లో 97శాతం సక్సెస్ అయ్యామని సైంటిస్టులు తెలిపారు.