మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్కు అందజేసినట్లు ఆయన ప్రకటించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ బీరేన్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు. దీంతో బీరేన్ సింగ్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. ‘సీఎం పదవికి రాజీనామా చేశాను. గవర్నర్కు సమర్పించా. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నన్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలం మార్చి 19 వరకూ ఉంది. ఆ తర్వాతే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం వుంటుందని భావిస్తున్నా’ అని బీరేన్ సింగ్ ప్రకటించారు.
మణిపూర్ పొత్తులపై సీఎం బీరేన్ సింగ్ కీలక ప్రకటన చేవారు. ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) తో తాము పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఎన్పీఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్)కి సంబంధించిన నేతలు, ఇతర స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటుపై తమను సంప్రదించారని ఆయన వెల్లడించారు. కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని బీరేన్ సింగ్ ప్రకటించారు.