Manoj Jha: బీహార్లో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నితీశ్కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండటం బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఏ క్షణమైనా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన మహా కూటమి సర్కారు కూలిపోనుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ (శనివారం) ఆర్జేడీ శాసనసభాపక్షం సమావేశమైంది. సమావేశం సజావుగా సాగిందని, ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. పార్టీ అధినేత లాలూ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్, పార్టీ ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.