హిమగిరుల్లో కరుగుతున్న మంచు పలకలు కావివి. ఆకాశగంగలో పాలపొంగులు కావివి. నీలి నింగిలో మేఘాలు కావివి. యమునా తీరాన నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురగలు ఇవి. ఒకప్పుడు యమునా తీరాన.. సాయంకాల వేళ.. సేదదీరడానికి తరలిన ప్రజలు ఇప్పుడు ఆ వైపునకు చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి. అయినా ఛత్ పూజ సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా మహిళలు ఆదివారం ఆ మురుగు నీటిలోనే పూజలు చేశారు.