జైపూర్, ఏప్రిల్ 4: నల్లాల్లో వచ్చిన కలుషిత నీరు తాగి వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కేవలం ఏడు నిముషాల దూరంలో ఉన్న సుశీల్పురలో చాలా రోజులుగా మురికినీరే వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
లీకైన నల్లా పైపుల్లో మురికి నీరు కలిసిపోవడంతో కొన్ని రోజులుగా పసుపు, నలుపు రంగులో దుర్వాసనతో కూడిన నీరు వస్తున్నదని, ఇది తాగి వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు తెలిపారు. కడుపునొప్పి, విరోచనాలు, వాంతులు, జ్వరం లక్షణాలతో పలువురు దవాఖానల పాలయ్యారు.