Ram Bhajan: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. భక్తీగీతాలు, భజన పాటలు, శ్రీరామ కీర్తనలతో అయోధ్య రామాలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.
శ్రీరాముడి భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు చేరుకుని రామనామ జపం చేస్తున్నారు. భజన పాటలు, కీర్తనలతో అయోధ్య రామయ్యను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో కొంతమంది మహిళలు గుమిగూడి రామ భజన చేశారు. శ్రీరాముడి భక్తి గీతాలు పాడుతూ, అందుకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ రామయ్యను స్తుతించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.