చెన్నై: సాధారణంగా దీపావళి పండుగ అంటే ఎవరైనా వాకిళ్లలో దివ్వెలు వెలిగించి చేసుకుంటారు. పటాసులు కాలుస్తారు. కొందరు నూతన వస్త్రాలు ధరించి వ్రతాలు, నోములు చేసుకుంటారు. కానీ, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లోని గుమటపుర గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నమైన సంప్రదాయం ఉన్నది. అక్కడ పండుగ రోజు అందరిలాగే దీపాలు వెలిగించి, పటాసులు కాల్చి జరుపుకున్నా.. పండుగ తర్వాత ఓ వింత ఆచారం ఉన్నది.
గుమటిపురా గ్రామంలో దీపావళి పండుగతోపాటు ఆ తర్వాత దీపావళి ముగింపు ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా ఈ నెల 6న గుమటిపురాలో దీపావళి ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒకరిపై ఒకరు పేడ విసురుకున్నారు. పేడ బంతుల చేసి కొట్టుకున్నారు. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించండి.