న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనా ప్రాంతం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలోని వారంతా ప్రాణాలతో బయటికి వచ్చారా..? లేదా ఇంకా ఎవరైనా అందులోనే చిక్కుకు పోయారా..? అనే వివరాలు తెలియరాలేదు. మంటలు అదుపులోకి వస్తేగానీ మరిన్ని వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.
#WATCH | Thick black smoke rises from fire at a building in Noida’s Sector 3. More details awaited.#UttarPradesh pic.twitter.com/SRE6FdBthO
— ANI (@ANI) October 7, 2022