ప్రయాగ్రాజ్: దేశంలోని గంగ, యమునా నదీ తీరాల్లో సైబీరియన్ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వివిధ రంగుల్లో ఉండే ఈ పక్షలు ఆయా నదీ తీరాల్లో విహార యాత్రలకు వెళ్లిన పర్యాటకులను, తీర్థయాత్రకు వెళ్లిన భక్తులను అలరిస్తున్నాయి. దాంతో పర్యాటకులు పడవల్లో వాటి సమీపానికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కాగా, ప్రతి ఏడాది శీతాకాలంలో సైబీరియన్ పక్షులు మూడు నుంచి నాలుగు నెలలపాటు ఉత్తరాదిలోని నదీతీరాలకు వలస వస్తాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమం దగ్గర కూడా సైబీరియన్ వలస పక్షుల సందడి మొదలైంది. ఈ వలస పక్షుల రాకతో త్రివేణీ సంగమం పరిసరాల్లోని పుష్కర ఘాట్లు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ఈ పక్షులు సందడి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో సైబీరియన్ వలసపక్షల సందడికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు..
#WATCH | Uttar Pradesh: Siberian migratory birds flock to Prayagraj’s Triveni Sangam, adding to the beauty of the ghats. pic.twitter.com/zh9pb040ZL
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 10, 2023