Bus stuck in stream : రాజస్థాన్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోటా, టోంక్ జిల్లాల్లో కుంభవృష్టి కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే కోటా జిల్లాలోని ఇటావా ఏరియాలో ఓ చెరువు పొంగిపొర్లుతూ రహదారిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. అయితే, ఈ వరద ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేసిన ఓ ఆర్టీసీ డ్రైవర్.. 40 ప్రయాణికులతో ఉన్న బస్సును వరద దాటించే ప్రయత్నం చేశాడు.
కానీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు వెనుక భాగం ఒక పక్కకు జారిపోతుండటాన్ని గ్రహించి ఆపేశాడు. బస్సు వరదలో చిక్కి విషయాన్ని గ్రహించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే సహాయక సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Rajasthan: SDRF team rescues 40 passengers travelling by a state roadways bus, which was stuck in an overflowing stream in Kota's Itawa area. Officials from Administration reached the spot. pic.twitter.com/W9yIyBjcrV
— ANI (@ANI) August 4, 2021