Indian Army Tribute | భారత సైన్యంలోని బైకర్ల బృందం.. గల్వాన్ లోయలో వీర మరణం పాలైన అమరవీరులకు ప్రత్యేక నివాళులర్పించింది. లడఖ్లోని హిల్స్ నుంచి ఎత్తు పల్లాల మధ్య నార్తర్న్ కమాండ్ సైనికుల టీం.. ర్యాలీ నిర్వహించింది. దానికి ముందు లేహ్లోని సమీప కరూ వద్ద నివాళులర్పించింది. అటుపై ర్యాలీ చేపట్టింది. శుక్రవారానికే 130 కి.మీ దూరం ర్యాలీ సాగింది. ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన వీడియో ట్విట్టర్లో షేర్ చేసింది. ష్యోక్ నది మీదుగా అఘం, ఖల్సర్ మీదుగా నుబ్రా వరకు ఈ ర్యాలీ సాగింది.
భారత్-చైనా సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణతో 2022 జూన్ 16న గల్వాయ్ లోయ వద్ద 16-బీహర్ రెజిమెంట్కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లలో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.