పనాజి: రష్యా రాజధాని మాస్కో నుంచి బయలుదేరిన మాస్కో-గోవా చార్టెర్డ్ విమానం ఎట్టకేలకు ఇవాళ గోవా రాజధాని పనాజికి చేరుకుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ విమానం సోమవారం రాత్రే పనాజి ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. కానీ పనాజి ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పనాజికి రావాల్సిన విమానాన్ని జామ్నగర్కు దారిమళ్లించారు. అనంతరం పనాజి ఎయిర్పోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో విమానాశ్రయంలో ఎక్కడా బాంబు లేదని తేలింది. దాంతో సోమవారం నాటిది ఫేక్ కాల్గా నిర్ధారించి, మాస్కో-గోవా చార్టెడ్ ఫ్లైట్ను ఇవాళ పనాజికి పంపించారు. కాల్ చేసిన ఆకతాయిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
#WATCH | Goa: Moscow-Goa chartered flight arrives in Panaji
It was diverted to Jamnagar last night after Goa ATC received a bomb threat, which was later found to be a hoax call and nothing suspicious was found. pic.twitter.com/fXJ2oyen1O
— ANI (@ANI) January 10, 2023