న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గీతా కాలనీలోని ఓ స్వీట్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.
స్వీట్ షాపులో చిక్కుకుపోయిన పెద్దావిడను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
#WATCH | Delhi: Fire breaks out at a sweet shop in Delhi’s Geeta Colony. Several fire tenders at the spot. Further details awaited. pic.twitter.com/Bv6Jezm5T5
— ANI (@ANI) July 2, 2023