Tejasvi Surya : కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ నాయకుడు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సిద్ధన్న లేఅవుట్లో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్న ముకేశ్ అనే యువకుడిపై ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకులు దాడికి పాల్పడ్డారు. దుకాణంలోని లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలిసా పెట్టుకున్నాడనే కారణంతో అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ ఘటనను నిరసిస్తూ ఇవాళ సిద్ధన్న లేఅవుట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
#WATCH | Bengaluru, Karnataka | BJP MP Tejasvi Surya joins the protest in Bengaluru following an altercation between a group of people and a shopkeeper during ‘Azaan’ time on Sunday, 17th March near Siddanna Layout. pic.twitter.com/SKy6NoJxPM
— ANI (@ANI) March 19, 2024
ఈ ఆందోళనల్లో ముకేశ్కు మద్దతుగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు. ముకేశ్పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు తేజస్వి సూర్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సూర్యను కారు ఎక్కిస్తున్న సమయంలో ‘సబ్ చలే జావ్’ (అందరూ వెళ్లిపోండి) అని ఆయన ఆందోళనకారులను కోరారు.
#WATCH | Bengaluru, Karnataka: BJP MP Tejasvi Surya detained by Police.
Tejasvi Surya urges the protestors to go back; says “Sab chale jao.” pic.twitter.com/JjGOKRmDtB
— ANI (@ANI) March 19, 2024