Lok Sabha elections : దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలు.. జూన్ 1న తుది విడత పోలింగ్ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి, రెండో విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ షురువైంది. ఈ క్రమంలో తొలి రెండు విడతల ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు.
తిరుచ్చి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని తిరుచిరాపల్లిలో ప్రతిపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి పీ కరుప్పయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుచిరాపల్లిలోని ఓ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు. అనంతరం ఓ తోపుడు బండి దగ్గర ఆయన కూరగాయలు, ఆకూకూరలు అమ్మారు. కరుప్పయ్య కూరగాయలు అమ్మిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Tamil Nadu: AIADMK Trichy Lok Sabha constituency candidate from Tiruchirappalli P Karuppaiah holds campaign in Tiruchirappalli.
During his campaign, he interacted with the vegetable sellers and also sold vegetables. pic.twitter.com/pKP24drmce
— ANI (@ANI) April 12, 2024