న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ఏరియాలో జనవరి 1 తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాద ఘటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. మహిళను కారుతో ఢీకొట్టి దాదాపు 10 కిలోమీటర్లకుపైగా ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. నిన్నటి నుంచి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాధిత మహిళ ఇవాళ ప్రాణాలు కోల్పోవడంతో జనం సుల్తాన్పురి పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
ఈ క్రమంలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ సైతం ఆందోళనకు దిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా నివాసం ముందు ఆప్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్ ఎల్జీ చేతిలో ఉన్నందున ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆప్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆప్ కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, ఎల్జీ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు.
#WATCH | AAP workers gather outside the residence of Delhi LG Vinai Saxena regarding the death of a woman who died after she was dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area on January 1. pic.twitter.com/HaDSK8b3ld
— ANI (@ANI) January 2, 2023