జైపూర్: రాజస్థాన్లో ఘనంగా హర్యాళీ తీజ్ ఉత్సవం జరుగుతున్నది. రాజధాని జైపూర్లోని ప్యాలెస్ నుంచి తీజ్ మాతా శోభాయాత్ర ఘనంగా మొదలైంది. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. మగవాళ్లు భజన పాటలతో, ఆటలతో యాత్రలో ముందు నడుస్తుండగా, వివాహితులైన మహిళలు బోనాలు ఎత్తుకుని వెనుక నడిచారు. ఈ యాత్రకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడండి.
#WATCH | A procession of Goddess Teej taken out from City Palace in Jaipur on the occasion of Haryali Teej#Rajasthan pic.twitter.com/SOFsnh92nO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 19, 2023
కాగా, ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని శుక్ల పక్షం తదియ తిథి నాడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తీజ్ మాతా ఉత్సవం నిర్వహిస్తారు. పార్వతీ దేవినే వారు తీజ్ మాతాగా పూజిస్తారు. పార్వతీ దేవి 107 జన్మలపాటు శివుని కోసం తపస్సు చేసి, 108 జన్మలో ఇదే తిథి నాడు శివుడిని పొందినదని అక్కడి పురాణాలు చెబుతున్నాయి.
అందుకే శ్రావణ మాసం శుక్ల తదియ నాడు తీజ్ మాతా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున వివాహితులైన మహిళలు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తారు. తమ భర్తలు దీర్ఘాయుష్షుతో ఉండాలని, సిరిసందలతో తులతూగాలని ఈ ఉత్సవాల సందర్భంగా మహిళలు తీజ్ మాతను కోరుకుంటారు.